వైయ‌స్ఆర్‌సీపీ అనుబంధ విభాగాల అధ్య‌క్షుల నియామ‌కం

తాడేప‌ల్లి:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీలో పదవుల భర్తీలో భాగంగా అనుబంధ విభాగాలకు అధ్యక్షులుగా మరికొందరిని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి  వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నియమించారు. మొత్తం 15 విభాగాలకు అధ్యక్షులను నియమించారు.

  • వైయ‌స్ఆర్‌సీపీ, రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలిగా ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి
  • రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడిగా ఎంవీఎస్‌ నాగిరెడ్డి
  • రాష్ట్ర ఎస్టీ సెల్‌ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు
  • రాష్ట్ర మైనారిటీ సెల్‌ అధ్యక్షుడిగా ఖాదర్‌బాషా
  • రాష్ట్ర పంచాయతీరాజ్‌ విభాగం అధ్యక్షుడిగా వెన్నపూస రవీంద్రారెడ్డి
  • రాష్ట్ర మున్సిపల్‌ విభాగం అధ్యక్షుడిగా రేపాల శ్రీనివాస్‌
  • రాష్ట్ర వాలంటీర్‌ విభాగం అధ్యక్షుడిగా నాగార్జునయాదవ్‌
  • రాష్ట్ర వైయ‌స్ఆర్‌ ట్రేడ్‌ యూనియన్‌ అధ్యక్షుడిగా గౌతంరెడ్డి
  • రాష్ట్ర లీగల్‌ సెల్‌ అధ్యక్షుడిగా మనోహర్‌రెడ్డి
  • రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షురాలిగా వంగపండు ఉష
  • రాష్ట్ర ఐటీ విభాగం అధ్యక్షుడిగా పోసమరెడ్డి సునిల్‌
  • రాష్ట్ర వికలాంగుల విభాగం అధ్యక్షుడిగా బండెల కిరణ్‌రాజు
  • రాష్ట్ర గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడిగా నారాయణమూర్తి
  • రాష్ట్ర వైయ‌స్ఆర్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ అధ్యక్షులుగా ఇద్దరు ఎమ్మెల్సీలు.. రామచంద్రారెడ్డి (ప్రైవేట్‌ స్కూళ్లు) , చంద్రశేఖర్‌రెడ్డి (గవర్నమెంట్‌ స్కూళ్లు)
  • రాష్ట్ర అంగన్‌వాడీ విభాగం అధ్యక్షురాలిగా చిన్నమ్మను నియమించారు.
Back to Top