వైయ‌స్ జ‌గ‌న్‌కు అడుగ‌డుగునా అడ్డంకులు

వినుకొండ పర్యటన నేపథ్యంలో అర్ధరాత్రి నుంచే భ‌ద్ర‌త కుదింపు

రిపేర్‌లో ఉన్న బుల్లెట్‌ ఫ్రూఫ్‌ వాహనం ఇవ్వడంతో మార్గంలో పలుమార్లు వాహనం మొరాయింపు

 వైయ‌స్ జగన్ వెంట వెళ్లకుండా పార్టీ నేత‌ల‌ను అడ్డుకుంటున్న‌ పోలీసులు  

 గుంటూరు:  వైయ‌స్ఆర్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి భద్రతపై చంద్రబాబు సర్కార్‌ తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. వినుకొండ పర్యటన నేపథ్యంలో అర్ధరాత్రి నుంచే వైయ‌స్‌ జగన్‌కు భద్రతను తగ్గించిన ప్రభుత్వం.. ఆయనకు పాత బుల్లెట్‌ ఫ్రూఫ్‌ వాహనాన్ని కేటాయించింది. 
రిపేర్‌లో ఉన్న బుల్లెట్‌ ఫ్రూఫ్‌ వాహనం ఇవ్వడంతో మార్గంలో పలుమార్లు వాహనం మొరాయించింది. దీంతో మధ్యలోనే బుల్లెట్‌ ఫ్రూప్‌ వాహనం నుంచి దిగిన వైఎస్‌ జగన్‌.. మరో వాహనంలో వినుకొండ వెళ్తున్నారు.

మరోవైపు, వినుకొండ వెళుతున్న వైయ‌స్ జగన్ కాన్వాయ్‌పై పోలీసులు ఆంక్షలు విధించారు. వైయ‌స్ జగన్ వెంట పార్టీ నేతలు వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. వైయ‌స్ జగన్‌తో పాటు నేతలు వినుకొండ బయలుదేరారు. ఎక్కడికక్కడ నేతల కార్లను వైయ‌స్ జగన్ వెంట వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. వైఎస్‌ జగన్‌ పర్యటనను కవర్‌చేస్తున్న జర్నలిస్టులకు కూడా పోలీసులు తీవ్ర అడ్డంకులు సృష్టిస్తున్నారు. కాన్వాయ్‌లో జర్నలిస్టుల వాహనాలను నిలిపేశారు. పోలీసులు తీరుపై వైయ‌స్ఆర్‌సీపీ నేతలు మండిపడుతున్నారు. 

Back to Top