ఇవి మ్యాన్‌ మేడ్‌ ఫ్లడ్స్‌

వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌ వైయస్‌ జగన్ మోహ‌న్ రెడ్డి ఫైర్‌

విజయవాడ నగరంలో వరద ముంచెత్తిన సింగ్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో పర్యటించి వ‌ర‌ద బాధితుల‌ను ప‌రామ‌ర్శించిన మాజీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్ 

చంద్రబాబు ప్రభుత్వ ఘోర తప్పిదం

అందుకే విజయవాడ నగరం విలవిల

గతంలో ఎన్నడూ చూడని విపత్తు

మరోవైపు బాధితులనూ ఆదుకోవడం లేదు

వరద బాధితులకు కనీసం మంచినీరు లేదు

రిలీఫ్‌ క్యాంప్స్‌ లేవు. సహాయక చర్యలూ లేవు :  వైయస్‌ జగన్‌ ధ్వజం

టీడీపీ కూటమి ప్రభుత్వ తీరు దారుణం

సీఎం చంద్రబాబు ప్రజలకు క్షమాపణ చెప్పాలి : వైయస్‌ జగన్‌ డిమాండ్‌

ఫ్లడ్‌ కుషన్‌ ఏర్పాటు చేయకపోవడంతో వరద ఉధృతి

కనీసం ఎగువ డ్యామ్‌ల నుంచి నీటిని తగ్గించలేదు

అర్థరాత్రివేళ బుడమేరులో 11 లాక్‌లు ఎత్తివేశారు

కనీసం ప్రజలకు అలర్డ్‌ కూడా ఇవ్వలేదు

చంద్రబాబు నివాసాన్ని కాపాడుకోవడమే లక్ష్యం

అందుకే విజయవాడ నగరాన్ని నీటిలో ముంచేశారు : మాజీ సీఎం వైయస్‌ జగన్‌ వెల్లడి

రాష్ట్రంలో వరదలు కొత్త కానే కాదు

చంద్రబాబుది దారుణమైన మేనేజ్‌మెంట్‌

మా హయాంలో వాలంటీర్లు, సచివాలయాలు

పక్కా వ్యవస్థతో వేగంగా బాధితులను ఆదుకున్నాం

సహాయ చర్యల్లో కలెక్టర్లకు బాధ్యత. వారు పనిలో నిమగ్నం

ఆ పనులకు ఆటంకం లేకుండా వారం తర్వాతే పర్యటన

ప్రజలను వేగంగా రిలీఫ్‌ క్యాంప్‌లకు తరలించాం

వారు తిరిగి వెళ్లేటప్పుడు రూ.2 వేల చొప్పున ఇచ్చాం : గుర్తు చేసిన  వైయస్‌ జగన్‌

ఇకనైనా రెడ్‌ బుక్‌ రాజ్యాంగాన్ని వదలండి

గవర్నెన్స్‌పై దృష్టి పెట్టండి: సీఎం చంద్రబాబుకు వైయస్‌ జగన్‌ హితవు

విజయవాడ:  విజయవాడ మునిగిపోవడానికి కారణం మ్యాన్‌ మేడ్‌ ఫ్లడ్స్‌ అని మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వ ఘోర తప్పిదం వల్లనే విజయవాడ నగరం విలవిల్లాడుతోందన్న ఆయన, గతంలో ఎన్నడూ ఇంత విపత్తు చూడలేదని స్పష్టం చేశారు. మరోవైపు వరద బాధితులనూ ఆదుకోవడం లేదని, వారికి కనీసం మంచినీరు కూడా సరఫరా చేయడం లేదని, రిలీఫ్‌ క్యాంప్స్‌ లేవని, ఇంకా ఎలాంటి సహాయక చర్యలూ లేవని అన్నారు. విజయవాడ నగరంలోని ప‌లు వ‌ర‌ద ప్రాంతాల‌ను వైయ‌స్ జ‌గ‌న్ ప‌రిశీలించారు. కొన్ని చోట్ల దాదాపు నడుంలోతు నీళ్లలో సైతం స్వయంగా నడిచిన  వైయస్‌ జగన్, వరద బాధితులను వ్యక్తిగతంగా కలుసుకున్నారు. వారి కష్టాలు, వారికి అందిన సాయాన్ని ఆరా తీశారు. తిండి, నీరు లేక రెండు రోజులుగా తాము నానా ఇబ్బంది పడుతున్నా, కనీసం పట్టించుకున్న వారు లేరని, ఎక్కడికైనా వెళ్లిపోదామంటే, కనీసం బోట్లు కూడా ఏర్పాటు చేయలేదని విజయవాడ నగర బాధితులు గోడు వెళ్లబోసుకున్నారు. వారి బాధలు విన్న వైయస్‌ జగన్‌ వారికి ఓదార్పునిచ్చారు.

ఈ సందర్భంగా  వైయస్‌ జగన్‌ మీడియాతో మాట్లాడారు. 
    వరద బాధితులకు రెండు రోజులుగా కనీసం ఆహారం కూడా అందడం లేదని, వారిని తరలించేందుకు తగిన సంఖ్యలో బోట్లు కూడా ఏర్పాటు చేయలేదని తెలిపారు. నిజంగా ఇంత దారుణ పరిస్థితులు గతంలో ఎప్పుడూ చూడలేదని చెప్పారు. ఇంతకు ముందు ఇప్పటికన్నా ఎక్కువ వర్షాలు కురిశాయని, కానీ ఏరోజూ ప్రజలు ఈ స్థాయిలో బాధ పడలేదని గుర్తు చేశారు.

చంద్రబాబు ప్రభుత్వ ఘోర తప్పిదం:
    బంగాళాఖాతంలో అల్పపీడనంపై గత నెల 28న, ఐఎండీ నుంచి ప్రభుత్వానికి వార్నింగ్‌ అందిందని, 20 సెం.మీ వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారన్న  వైయస్‌ జగన్, అది అత్యధిక వర్షపాతమని వెల్లడించారు. అయినా కూటమి ప్రభుత్వం ఏ మాత్రం సీరియస్‌గా తీసుకోలేదని, కనీసం సమీక్ష కూడా జరపలేదని గుర్తు చేశారు. దిగువ ప్రాంతాలే కాకుండా, ఎగువన తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని, అందువల్ల కృష్ణా నది పరీవాహక ప్రాంతంలో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యే వీలుందని కూడా సమాచారం అందినా, కూటమి ప్రభుత్వం అస్సలు పట్టించుకోలేదని ఆక్షేపించారు.

వాటర్‌ కుషన్‌ ఏర్పాటు లేదు:
    ఎగువన ప్రాజెక్టులు పూర్తిగా నిండిన నేపథ్యంలో, నీరు విడుదల చేస్తే ఏం చేయాలన్న దానిపై ఏ మాత్రం ఆలోచన చేయలేదని శ్రీ వైయస్‌ జగన్‌ ప్రస్తావించారు. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల నుంచి కనీసం 60–70 టీఎంసీల నీటిని తగ్గించి, అక్కడ వాటర్‌ ఫ్లడ్‌ కుషన్‌ ఏర్పాటు చేసుకోవాలని గుర్తు చేశారు. కానీ ఆ పని చేయకపోవడం వల్ల కృష్ణా నదిలో వరద పోటెత్తడంతో, ఏకంగా 1.70 లక్షల క్యూసెక్కుల నీటి వరద వచ్చిందని.. దీనిపైనా కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) సమాచారం ఇచ్చిందని తెలిపారు.
    వాటర్‌ కుషన్‌ ఏర్పాటు చేసి 30వ తేదీ నుంచి నీళ్లు తగ్గించుకుంటూ వచ్చి ఉంటే, ఇక్కడ వరద 8 లక్షల నుంచి 9 లక్షల క్యూసెక్స్‌కే పరిమితం అయ్యేదని శ్రీ వైయస్‌ జగన్‌ వెల్లడించారు. కానీ, కూటమి ప్రభుత్వ తీవ్ర నిర్లక్ష్యం వల్ల ఏకంగా 11.35 లక్షల క్యూసెక్స్‌ వరద వచ్చిందని చెప్పారు. ప్రభుత్వం పరిపాలన పూర్తిగా గాలికి వదిలి, రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలు చేస్తూ, తమ పార్టీపై కక్ష సాధింపు చర్యలతోనే కాలం వెళ్లదీస్తోందని ఆక్షేపించారు. ఇకనైనా దాన్ని వదిలి పరిపాలన (గవర్నెన్స్‌)పై దృష్టి పెట్టాలని హితవు చెప్పారు.

చంద్రబాబు ఇంటి కోసమే..:
    బుడమేరులో వరద పోటెత్తడంతో, కనీసం అలారం కూడా ఇవ్వకుండా శనివారం అర్ధరాత్రి 11 లాక్‌లు ఎత్తేశారని, దీంతో నీరు విజయవాడ నగరాన్ని ముంచెత్తిందని  వైయస్‌ జగన్‌ తెలిపారు. ఇంత కంటే దారుణం మరొకటి ఉండదన్న ఆయన, కేవలం చంద్రబాబు నివాసం ఉంటున్న కరకట్ట అక్రమ కట్టడాన్ని కాపాడుకోవడం కోసమే, ఆ పని చేశారని అన్నారు. నగరాన్ని నీటిమయం చేశారని చెప్పారు.

క్షమాపణ చెప్పాలి:
    ‘నేను అడుగుతున్న ప్రతి ప్రశ్న కూడా లాజికల్‌గా అడుగుతున్నాను. ఎవరైనా సమాధానం చెప్పాలనుకుంటే మొట్టమొదట ప్రజలకు క్షమాపణ చెప్పి, ఆ తర్వాత ప్రజలకు ఏం చేయబోతున్నామన్నది చెప్పి.. ఆ తర్వాతే సమాధానం చెప్పాలని చంద్రబాబుకు గట్టిగా చెబుతున్నాను’.. అని వైయస్‌ జగన్‌ స్పష్టం చేశారు.
     ఇప్పటికీ తగిన రిలీఫ్‌ క్యాంప్‌లు లేవన్న ఆయన, నిన్నటి దాకా ఓ 6 క్యాంప్‌లు ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారని తెలిపారు. వరదల్లో లక్షల మంది మునిగి ఉంటే, ఆ క్యాంప్‌లు ఏ మూలకు సరిపోతాయని ప్రశ్నించారు. నిజానికి అవి కూడా ఎక్కడున్నాయన్న సమాచారం వరద బాధితులకు లేదని చెప్పారు.

గతంలోనూ ఇంత వరద. అయినా..:
    నిజానికి 11.30 లక్షల క్యూసెక్స్‌ వరద ఇప్పుడు కొత్త కాదన్న వైయస్‌ జగన్, 120 ఏళ్ల క్రితం 1903లో 11.90 లక్షలు, 2009లో 11.10 లక్షల క్యూసెక్స్‌ వరద వచ్చిందని వెల్లడించారు. తమ ప్రభుత్వ హయాంలో కూడా 2019 నుంచి వరసగా మూడేళ్లు ఇలాంటి వర్షపాతం నమోదైనా.. ఈ స్థాయిలో 11 లక్షల క్యూసెక్స్‌కు పైగా వరదనీరు రావడం, ప్రజలు ఇన్ని బాధలు పడడం జరగలేదని, అందుకు కారణం.. పక్కాడా ఫ్లడ్‌ కుషన్‌ ఏర్పాటు చేసుకోవడం, అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడమేనని స్పష్టం చేశారు. దీన్ని ప్రతి ఒక్కరూ గమనించాలని కోరారు.
    ఇప్పుడు తాము అధికారంలో లేకపోయినా, పార్టీ నుంచి నేతలు, నాయకులు, కార్యకర్తలంతా పని చేస్తారని, స్థానిక ప్రజాప్రతినిధులూ పాల్గొంటారని.. వాళ్లు చేయగలిగినంత సహాయ చర్యలు చేస్తారని వైయస్‌ జగన్‌ వెల్లడించారు.

అప్పటి వ్యవస్థలు. మా పనితీరు:
    గతంలో తమ ప్రభుత్వ హయాంలో ఏ ఒక్కరూ అసంతృప్తిగా లేరన్న శ్రీ వైయస్‌ జగన్, అప్పుడు వాలంటీర్లు, సచివాలయాల వ్యవస్థ పక్కాగా పని చేసేదని, నిత్యం ప్రజలతో మమేకమై ఉండేదని గుర్తు చేశారు. ఎప్పుడు ఏ విపత్తు సంభవించే అవకాశం ఉన్నా, ముందే అప్రమత్తం కావడం, ప్రజలను అప్రమత్తులను చేయడం, వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం, రిలీఫ్‌ క్యాంప్‌లు ఏర్పాటు చేయడం, వారికి ఆర్థిక సాయం అందించడం.. ఇవన్నీ శాచురేషన్‌ పద్ధతిలో జరిగేవని తెలిపారు.
    ‘వైయ‌స్ జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తుపాన్‌ వస్తే, కలెక్టర్‌ గారికి నేను చెప్పేవాడిని. నేను మీకు వారం రోజులు టైమ్‌ ఇస్తున్నా. వారం తర్వాత వస్తాను. వచ్చిన తర్వాత ప్రజలతో మమేకమై నేను అడుగుతాను. ఏ ఒక్కరి నోట్లో నుంచి కూడా కలెక్టర్‌ మాకు పలకలేదు, కలెక్టర్‌ స్పందించ లేదు. కలెక్టర్‌ వల్ల మాకు మంచి జరగలేదు అన్న మాట ఎప్పుడూ వినపడకూడదు అని నేను ఆదేశాలు ఇచ్చేవాడిని’.
    ‘మా కలెక్టర్‌ బాగా పని చేశాడు. మా కలెక్టర్‌ మంచివాడు అని వినపడాలని గట్టిగా చెప్పేవాడిని. చెప్పిన ప్రకారం వారం రోజుల తర్వాత నేను వెళ్లేవాడిని. అప్పటికే వాలంటీర్ల సైన్యం అక్కడ ముందే ఉండేది. 
గ్రామ సచివాలయాల్లో పని చేసే మొత్తం పిల్లలందరూ అక్కడే ఉండే వారు. వారం రోజుల పాటు వాళ్లంతా కూడా ప్రభుత్వం అంతా కలిసి ప్రతి గడపకూ వెళ్లి సహాయ సహకారాలు అందిస్తూ, మొట్టమొదటిసారిగా ఇంతకు ముందు ఎప్పుడూ జరగని విధంగా ప్రతి కుటుంబానికీ రూ.2 వేలు ఆర్థిక సహాయం కూడా అందించినది ఒక్క వైయ‌స్ జగన్‌ హయాంలోనే జరిగింది. అటువంటి కొత్త సంప్రదాయాలు తీసుకొచ్చింది, వాలంటీర్, సచివాలయ వ్యవస్థలను ముందు పెట్టింది మనమే. వాటి ద్వారా ప్రతి గడపకూ సహాయ సహకారాలు అందించగలిగాం’.. అని వైయస్‌ జగన్‌ వివరించారు.

మరి ఇప్పటి పరిస్థితి:
    అదే ఇప్పటి పరిస్థితి చూస్తే.. ‘ప్రతి బాధితుడు కూడా మాట్లాడినది మీరు కూడా విన్నారు. ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారంటే తెలియదు సార్, తెలియదు అన్నా, మా బంధువుల ఇళ్లకు పోవాలి అంటున్నారు. కనీసం ఒక్క బాధితుడైనా రిలీఫ్‌ క్యాంపులకు మేం పోతున్నాం, అక్కడ పెట్టారు అన్న మాట ఒక్క బాధితుడైనా చెప్పాడా? అని అడుగుతున్నా’.
    ‘రెండు రోజుల్లో కనీసం ఏదైనా సహాయం అందిందా? ఇంటికి వచ్చి ఎవరైనా డబ్బులిచ్చారా? అని అడిగాను. డబ్బులు కథ దేవుడెరుగు.. మంచి నీళ్లు ఇచ్చే నాథుడు లేడనే మాటలు వినిపించాయి. మీరంతా విన్నారు. ఇది ప్రభుత్వ తప్పిదమే. మ్యాన్‌ మేడ్‌ ఫ్లడ్‌ మాత్రమే’.. అని వైయస్‌ జగన్‌ స్పష్టం చేశారు.

Back to Top