విజయవాడలో వరద బాధితులకు వైయ‌స్‌ జగన్‌ పరామర్శ

రెండు రోజులుగా నీళ్లు లేవు, తిండి లేదు

మమ్మల్ని ఎవరూ పట్టించుకోవడం లేద‌ని వ‌ర‌ద బాధితుల ఆవేద‌న 

 విజ‌య‌వాడ‌:  వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి విజ‌య‌వాడ‌లోని వ‌ర‌ద బాధితుల‌ను ప‌రామ‌ర్శించారు. సింగ్‌ నగర్‌ చేరుకున్న వైయ‌స్‌ జగన్..పలు ప్రాంతాలను పరిశీలించారు. తమ గోడును బాధితులు వైయ‌స్‌ జగన్‌కు చెప్పుకుంటున్నారు. మూడు రోజులు నుంచి ప‌రిస్థితి ఇలాగే ఉంది.మమ్మల్ని ఎవరూ పట్టించుకోవడం లేద‌ని బాధితులు ఆవేద‌న‌ వ్య‌క్తం చేశారు. ప్రభుత్వ సాయం ఏమైనా అందుతుందా? అని వైయ‌స్ జ‌గ‌న్ బాధితుల‌ను ఆరా తీశారు. ఇప్పటి వరకు మా కోసం ఏ నాయకుడూ రాలేదు. జనం కోసం మీరు వచ్చారని స్థానికులు పేర్కొన్నారు. ఫస్ట్‌ ఫ్లోరోలో చిన్న పిల్లలతో రెండు రోజుల నుంచి ఉన్నాం. నీళ్లు లేవు, తిండి లేదు. బోట్లు ఎందుకు ఉపయోగపడం లేదని పేర్కొన్నారు. నిజమైన బాధితులకు బోట్లు ఇవ్వలేదు. పిల్లలు కూడా తిండి లేకుండా ఉన్నార‌ని త‌మ గోడును వైయ‌స్ జ‌గ‌న్ ముందు వెల్ల‌గ‌క్కారు.

Back to Top