చివ‌రి వ‌ర‌కు వైయ‌స్ఆర్‌సీపీలోనే ఉంటా

రాజ్య‌స‌భ స‌భ్యుడు ఆర్‌.కృష్ణ‌య్య‌

తాడేప‌ల్లి: చివ‌రి వ‌ర‌కు తాను వైయ‌స్ఆర్‌సీపీలోనే ఉంటా, బీసీల కోసం పోరాడ‌తా అని రాజ్య‌స‌భ స‌భ్యుడు ఆర్‌.కృష్ణ‌య్య పేర్కొన్నారు.  బీసీల అభ్యున్న‌తే త‌న అజెండా అని స్ప‌ష్టం చేశారు. బీసీల కోసం మాట్లాడ‌మ‌నే వైయ‌స్ జ‌గ‌న్ న‌న్ను రాజ్య‌స‌భ‌కు పంపించార‌ని చెప్పారు. చ‌ట్ట‌స‌భ‌ల్లో బీసీల రిజ‌ర్వేష‌న్ కోసం పోరాడే పార్టీ వైయ‌స్ఆర్‌సీనే అన్నారు.  వ్య‌క్తిగ‌త అవ‌స‌రాల కోస‌మే కొంద‌రు పార్టీ మారుతున్నార‌ని ఆక్షేపించారు. తాను పార్టీ మారుతున్నాన‌ని జ‌రుగుతున్న ప్ర‌చారంలో వాస్త‌వం లేద‌న్నారు. నేను పార్టీ మారే ప్ర‌స‌క్తే లేద‌ని ఉద్ఘాటించారు.  తాను పార్టీ మార‌తానంటే ప్ర‌జ‌లెవ‌రూ న‌మ్మ‌ర‌ని చెప్పారు. బీసీల కోసం కొట్లాడ‌మ‌నే వైయ‌స్ జ‌గ‌న్ న‌న్ను రాజ్య‌స‌భ‌కు పంపించార‌ని గుర్తు చేశారు. తాను పార్టీ మారే ప్ర‌స‌క్తే లేద‌ని ఆర్‌.కృష్ణ‌య్య‌ స్ప‌ష్టం చేశారు.

Back to Top