కాకినాడ : రాజకీయంగా ఎదుర్కొనలేకే తిరుపతి లడ్డూ ప్రసాదం ద్వారా వైయస్ జగన్పై కూటమి ప్రభుత్వం ఆరోపణలు చేస్తోందని, దమ్ముంటే ఆ ఆరోపణలను నిజమని నిరూపించాలని వైయస్ఆర్సీపీ నేత వంగా గీత సవాల్ విసిరారు. పిఠాపురం వైయస్ఆర్సీపీ ఇన్చార్జ్ వంగా గీత గురువారం మధ్యాహ్నాం కాకినాడలో మీడియాతో మాట్లాడారు. ‘‘ సిట్ పేరిట చంద్రబాబు తమకు కావాల్సిన మనుషులతో విచారణ జరిపిస్తే ఎలా?. టీటీడీ లడ్డు వివాదంలో నిష్పక్షపాతమైన విచారణ జరగాలి. సీబీఐ లేదంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. చేసిన ఆరోపణల్లో కూటమి ప్రభుత్వం నిజనిజాలు తేల్చాలి అని గీత అన్నారు. వైయస్ జగన్ను రాజకీయంగా తగ్గించాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు తిరుమల లడ్డుపై ఆరోపణలు చేశారు. ముందు ఆ ఆరోపణలను నిజాలు అని నిరూపించండి. అప్పుడు జగన్ డిక్లరేషన్ గురించి మాట్లాడడండి అని రాజకీయ ప్రత్యర్థులకు ఆమె సవాల్ విసిరారు. చివర్లో దేవుడితో.. టీటీడీతో ఆటలొద్దని కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబుకి ఆమె హెచ్చరిక జారీ చేశారు.