కేసుల‌కు.. జైళ్ల‌కు భ‌య‌ప‌డేది లేదు

పిన్నెల్లిని కలిసిన మాజీ మంత్రి కాకాణి 

నెల్లూరు జిల్లా: నెల్లూరు జిల్లా సెంట్రల్ జైల్లో ఉన్న మాచర్ల మాజీ శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని శాసనమండలి సభ్యులు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి  తో కలిసి  మాజీ మంత్రివర్యులు డాక్ట‌ర్ కాకాణి గోవర్ధన్ రెడ్డి క‌లిశారు. తెలుగుదేశం ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని, కేసులకు, జైళ్లకు భయపడేవాళ్లం కాదని కాకాణి స్పష్టం చేశారు. వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ధైర్యంగా అరాచకాలను ఎదుర్కొని, పోరాటాలకు సిద్ధపడాలని మాజీ మంత్రి కాకాణి పిలుపునిచ్చారు.

పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పై పలు సెక్షన్లతో అనేక త‌ప్పుడు కేసులు బనాయించి, అరెస్టు చేసి జైలులో పెట్టడం హేయమైన చర్యగా ఆయ‌న పేర్కొన్నారు. వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీలో ఎవరికి ఏ కష్టం వచ్చినా, అండగా నిలిచి సంఘటితంగా పోరాడుతామని కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి తెలిపారు.

Back to Top