కొన‌సాగుతున్న కక్ష సాధింపు చర్యలు 

క‌దిరిలో  వైయ‌స్ఆర్‌సీపీ నేతలపై అక్ర‌మ కేసు

శ్రీసత్యసాయి జిల్లా: కదిరిలో వైయ‌స్ఆర్‌సీపీ నేతలపై టీడీపీ నేతలు కక్ష సాధింపు చర్యలకు దిగారు. మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా, కదిరి నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీపీ సమన్వయకర్త మక్బూల్‌ పై పోలీసులు అక్రమ కే‌సులు నమోదు చేశారు. చామలగొంది ఎంపీటీసీ లక్ష్మీదేవిని కిడ్నాప్ చేశారంటూ ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని ఇప్పటికే ఎంపీటీసీ లక్ష్మీదేవి ఓ సెల్ఫీ విడియో విడుదల చేశారు. టీడీపీ నేతల డైరెక్షన్‌లో పోలీసులు యాక్షన్ మొదలు పెట్టారు. ఎంపీటీసీ లక్ష్మీదేవి దూరపు బంధువు నుంచి ఫిర్యాదు తీసుకుని పోలీసులు కేసు నమోదు చేశారు. ఈనెల 27న గాండ్లపెంట ఎంపీపీ ఎన్నిక  నేపథ్యంలో టీడీపీ కుట్రలకు తెరతీసింది.

గుత్తిలో రెచ్చిపోయిన టీడీపీ గూండాలు
కాగా, అనంతపురం జిల్లా గుత్తిలో టీడీపీ గూండాలు రెచ్చిపోయారు. వైయ‌స్ఆర్‌సీపీ మాజీ ఎంపీ కోన మురళీధర్‌రెడ్డి ఇంటిపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఇంటి అద్ధాలు, వాహనాలను టీడీపీ గూండాలు ధ్వంసం చేశారు.

 

Back to Top