చంద్ర‌బాబు కోరుకున్న‌ట్టుగానే సిట్ నివేదిక ఇస్తుంది

ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌

తాడేప‌ల్లి: చంద్ర‌బాబు కోరుకున్న‌ట్టుగానే సిట్ నివేదిక ఇస్తుందని వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి అనుమానం వ్య‌క్తం చేశారు. జరగని తప్పు జరిగిందంటూ పరమ పవిత్రమైన శ్రీవారి లడ్డూ ప్రసాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిచ్చి ప్రేలాపనలు పేలుతూ ఘోర అపచారానికి ఒడిగట్టారు. లడ్డూల తయారీలో స్వచ్ఛమైన ఆవు నెయ్యికి బదులు జంతువుల కొవ్వుతో తయారు చేసిన నెయ్యిని వాడారంటూ నిరాధారమైన, దారుణ ఆరోపణలు చేశారు. ఈ అంశంపై కూట‌మి ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన సిట్ క‌మిటీపై ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి స్పందించారు.  సిట్ పూర్తిగా టీడీపీ ఆధీనంలో ఉందంటూ ఎంపీ ట్వీట్ చేశారు. సిట్ క‌మిటీ పూర్తిస్థాయిలో విచార‌ణ జ‌రుపుతుంద‌న్న న‌మ్మ‌కం లేదు. సీఎం కోరిన‌ట్లే సిట్ నివేదిక ఇస్తుంద‌ని విజ‌య‌సాయిరెడ్డి త‌న ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.

Back to Top