ఏపీకి ప్రత్యేకహోదా తప్ప ఏమీ వద్దు

ఎంపీ విజయసాయిరెడ్డి
 

న్యూఢిల్లీ: కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వ మనుగడకు 16 మంది ఎంపీలను అందించిన ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా తప్ప ఇంకేది అవసరం లేదని వైయ‌స్‌ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.

శుక్రవారం(జులై 26) ఈ విషయమై ఆయన ఎక్స్‌లో ఒక ట్వీట్‌ చేశారు. ‘కేంద్రం ఏర్పాటు చేసే అదనపు రుణాలు, ప్రత్యేక ప్యాకేజీ, మినహాయింపులు ఏవీ వద్దు. ఒక్క ప్రత్యేక హోదానే కావాలి. కేంద్ర బడ్జెట్‌ మాకు మాటల గారడిలా ఉంది అని విజయసాయిరెడ్డి విమర్శించారు.  

Back to Top