నేడు, రేపు వైయ‌స్‌ జగన్‌ పులివెందుల పర్యటన 

వైయ‌స్ఆర్‌ జిల్లా:  వైయ‌స్ఆర్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 25, 26వ తేదీల్లో పులివెందులలో పర్యటించనున్నారు.  ఈ నెల 25వ తేదీ  ఉదయం 10 గంటలకు గన్నవరం నుంచి హెలీకాప్టర్‌ ద్వారా బయలుదేరి 11.45గంటలకు పులివెందులలోని భాకరాపురం హెలీఫ్యాడ్‌ వద్దకు చేరుకుంటారు. అక్కడ నుంచి 11.55గంటలకు భాకరాపురంలోని తన నివాసానికి రోడ్డు మార్గాన చేరుకుంటారు.

12గంటల నుంచి భాకరాపురంలోని తన నివాసంలో నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు అందుబాటులో ఉంటారు. మంగళవారం రాత్రి తన నివాసంలో బస చేస్తారు. ఈనెల 26వ తేదీన బుధవారం ఉదయం 9.50 గంటలకు మాజీ సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి పులివెందుల పట్టణంలోని గుంత బజార్‌లో వైయ‌స్ఆర్‌  ఫౌండేషన్, ఎల్వీ ప్రసాద్‌ ఐ ఇన్‌స్టిట్యూట్‌ సంయుక్తంగా అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన వైయ‌స్‌ రాజారెడ్డి ఐ సెంటర్‌కు  చేరుకుని ప్రారంభిస్తారు.  

Back to Top