గవర్నర్ వెంటనే జోక్యం చేసుకుని పచ్చమూకల అరాచకాలను అడ్డుకోవాలి

టీడీపీ దాడుల కారణంగా నష్టపోయిన ప్రతి కార్యకర్తకూ, సోషల్‌ మీడియా సైనికులకు తోడుగా ఉంటాం

వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌ వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి  ట్వీట్‌

తాడేప‌ల్లి: రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ దాడులతో అత్యంత భయానక వాతావరణం నెలకొంద‌ని, గ‌వ‌ర్న‌ర్ వెంట‌నే జోక్యం చేసుకొని ప‌చ్చ‌మూక‌ల అరాచ‌కాల‌కు అడ్డుక‌ట్ట వేయాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి డిమాండు చేశారు. రాష్ట్రంలో జ‌రుగుతున్న దాడులు, అరాచ‌కాల‌పై వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స్పందించారు. తాడుల‌ను తీవ్రంగా ఖండించారు. ఈ మేర‌కు ఆయ‌న సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌న ఎక్స్‌(ట్విట్ట‌ర్‌)లో గ‌వ‌ర్న‌ర్‌ను విజ్ఞ‌ప్తి చేస్తూ, పార్టీ శ్రేణుల‌కు భ‌రోసా క‌ల్పిస్తూ ట్వీట్ చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ దాడులతో అత్యంత భయానక వాతావరణం నెలకొంది. ప్రభుత్వం ఏర్పాటుకాకముందే టీడీపీ ముఠాలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఎక్కడికక్కడ  గ్రామ సచివాలయాలు, ఆర్బీకేల్లాంటి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. వైయస్ఆర్‌సీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలకు రక్షణ లేకుండా పోయింది. అధికారపార్టీ ఒత్తిళ్లతో పోలీసు వ్యవస్థ నిస్తేజంగా మారిపోయింది. వెరసి ఐదేళ్లుగా పటిష్టంగా ఉన్న శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి.  గవర్నర్ వెంటనే జోక్యం చేసుకుని పచ్చమూకల అరాచకాలను అడ్డుకోవాలని, ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు, ప్రభుత్వ ఆస్తులకు రక్షణగా నిలవాలని విజ్ఞప్తిచేస్తున్నాం. టీడీపీ దాడుల కారణంగా నష్టపోయిన ప్రతి కార్యకర్తకూ, సోషల్‌ మీడియా సైనికులకు తోడుగా ఉంటామ‌ని వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ట్వీట్ చేశారు.

Back to Top