వైయ‌స్ఆర్‌సీపీ ఢిల్లీ ధ‌ర్నా విజ‌య‌వంతం

త్వరలో ప్రధాని మోదీని కలుస్తాం

వైయ‌స్ఆర్‌సీపీ నేతలు మేరుగు నాగార్జున‌, మార్గాని భ‌ర‌త్‌

కృష్ణా: దేశ రాజధానిలో ఢిల్లీలో వైయ‌స్ఆర్‌సీపీ  అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో ఈ నెల 24న చేప‌ట్టిన‌ ధర్నా విజయవంతమైంద‌ని పార్టీ నేత‌లు పేర్కొన్నారు. పలు జాతీయ పార్టీలు వైయ‌స్ఆర్‌సీపీ కి సంఘీభావం తెలిపాయ‌ని చెప్పారు.  ఏపీలో రాజ్యాంగబద్ధ పాలన జరుగుతోందా? అని పార్టీల నాయకులు ప్రశ్నించారు.  
ఇవాళ ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి మాజీ సీఎం, వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేరుకున్నారు. వారికి వైయ‌స్ఆర్‌సీపీ  నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మేరుగు నాగార్జున‌, మాజీ ఎంపీ మార్గాని భారత్ మీడియాతో మాట్లాడారు.

 ఏపీలో టీడీపీ ప్రభుత్వం చేస్తున్న కక్షపూరిత రాజకీయాలను అరికట్టడానికి ఢిల్లీ వేదికగా వైయ‌స్‌ జగన్‌ సారథ్యంలో ధర్నా నిర్వహించాం. దేశ రాజధాని ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఏపీలో టీడీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ఫొటోలు ప్రదర్శించి నిరసన తెలియజేసాం. 
 ఎస్పీ చీఫ్‌ అఖిలేష్ యాదవ్‌తోపాటు మరికొన్ని పార్టీలు మాకు మద్దతు తెలిపాయి. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు దుర్మార్గపు పాలన ఎలా ఉందో ప్రజలంతా అర్థం చేసుకోవాలి. త్వరలో దేశ ప్రధానమంత్రిని కలిసి పరిస్థితి వివరిస్తాం’ అని అన్నారు.

 టీడీపీ ప్రభుత్వం ఏర్పడి 45 రోజులు కాకుండానే ఇన్ని అరాచకాలు జరిగాయి. ఏపీలో రాష్ట్రపతి పాలన అవసరమని ఢిల్లీలో నిరసన తెలిపితే అనేక పార్టీలు సంఘీభావం తెలియజేశారు. రాష్ట్రంలో ప్రజలను చంద్రబాబు భయభ్రాంతులకు గురిచేస్తున్నాడు. వైయ‌స్‌ జగన్‌ సారధ్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమం విజయవంతం అయింద‌ని మాజీ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు.

Back to Top