ఠంచన్‌గా పింఛన్‌

సూర్యోదయానికి ముందే ఇంటింటికి వెళ్లి పింఛన్లు అందజేస్తున్న వలంటీర్లు

సీఎం వైయస్‌ జగన్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్న లబ్ధిదారులు

తాడేపల్లి: లాక్‌డౌన్‌తో తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్న నిరుపేద కుటుంబాలకు సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం బాసటగా నిలుస్తోంది.  రాష్ట్రవ్యాప్తంగా వైయస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక పంపిణీ ప్రారంభమైంది. సోమవారం ఉదయం నుంచే వలంటీర్లు ఇంటింటికి వెళ్లి లబ్ధిదారుల చేతికి జూన్‌ నెల పెన్షన్లు అందిస్తున్నారు. కరోనా నియంత్రణలో భాగంగా బయో మెట్రిక్‌కు బదులుగా పెన్షనర్ల ఫొటోల జియో ట్యాగింగ్‌ ద్వారా పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు.
వేరే ప్రాంతాల్లో ఉన్నా..
లాక్‌డౌన్‌ వల్ల వేరే ప్రాంతాల్లో ఉన్నవారికి కూడా పోర్టబులిటీ ద్వారా పెన్షన్లు అందిస్తున్నారు. ఉదయం 6 గంటల నుండి వలంటీర్లు ప్రతి గడప వద్దకు వెళ్లి పెన్షన్‌దారుల ఆరోగ్యంపై ఆరా తీస్తూ.. ప్రతి ఇంటిలోనూ భౌతిక దూరాన్ని పాటిస్తూ లబ్ధిదారులకు పెన్షన్‌ ఇస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 58.22 లక్షల మంది పెన్షన్లు అందుకోనుండగా, ఇందు కోసం ప్రభుత్వం సుమారు రూ.1,421.20 కోట్లు విడుదల చేసింది.
లబ్ధిదారుల హర్షం
పెన్షన్లు అందుకున్న లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో పింఛన్ల కోసం గంటల తరబడి పంచాయతీ కార్యాలయాల వద్ద పడిగాపులు కాసేవారమని, వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వలంటీర్లే తమ ఇళ్ల వద్దకు వచ్చి డబ్బులు ఇస్తున్నారని తెలిపారు. 

Back to Top