విశాఖపట్నం: నీతి, నిజాయితీ, చిత్తశుద్ధితో విధులు నిర్వర్తిస్తూ.. అసువులు బాసిన పోలీసులను స్మరించుకోవడం తమ కర్తవ్యమని పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. విశాఖపట్నంలో జరిగిన పోలీస్ అమర వీరుల సంస్మరణ సభకు మంత్రి శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అమరుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. పోలీసు యూనిఫాంకు ఒక గౌరవం ఉందని, ఆ గౌరవాన్ని చూసి యువత పోలీసు ఉద్యోగాల్లో చేరుతున్నారని తెలిపారు. పోలీసు ఉద్యోగుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి వీక్లీ ఆఫ్ అమలు చేస్తున్నారన్నారు. రాష్టంలో తీవ్రవాదం, నక్సలిజం రెండింటినీ పోలీసులు సమర్థవంతంగా ఎదుర్కుంటున్నారని, గంజాయి స్మగ్లింగ్ను రూరల్ పోలీసులు నియంత్రణలోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. అదే విధంగా విశాఖకు సైబర్ నేరాలు సవాళ్లుగా మారాయని, అనేకమంది చిన్నారులు ఆన్లైన్ గేమ్ల ద్వారా డబ్బులు నష్టపోతూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. వీటిని పోలీసులు నియంత్రించాల్సిన అవసరం ఉందన్నారు. Read Also: రివర్స్టెండరింగ్ సక్సెస్