నేడు ఉమ్మడి కర్నూలు జిల్లా నేతలతో వైయ‌స్‌ జగన్‌ సమావేశం 

తాడేప‌ల్లి:  వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షులు, మాజీ సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉమ్మడి కర్నూలు జిల్లా (కర్నూలు, నంద్యాల)కు చెంది­న స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో గురు­వారం సమావేశం కానున్నారు. 

తాడేపల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగే ఈ సమావేశానికి మేయర్, కార్పొరేటర్లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మున్సిపల్‌ చైర్‌పర్సన్లు, వైస్‌ చైర్మన్‌లు, మండల ప్రెసిడెంట్‌లను ఆహ్వానించారు.  వీరితో పాటు కర్నూలు, నంద్యాల జిల్లాల వైఎస్సార్‌సీపీ అధ్యక్షు­లు, నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలు హాజరుకానున్నారు.

Back to Top