తాడేపల్లి: పార్టీ కమిటీల నియామకం యుద్దప్రాతిపదికన పూర్తిచేయాలని వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అనుబంధ విభాగాల ఇంచార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సూచించారు. వైయస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీని బూత్ లెవల్నుంచి సంస్ధగతంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా పార్టీ అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా పార్టీ అనుబంధ విభాగాల ఇంఛార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అధ్యక్షతన తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు అంశాలను చర్చించారు. 1. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కమిటీల నియామకం యుద్దప్రాతిపదికన పూర్తిచేయాలి 2. అంకితభావం, కష్టపడేతత్వం, కెపాసిటీ ఉండే వ్యక్తులకు నియామకంలో ప్రాధాన్యత 3. వైయస్ఆర్సీపీ అనుబంధ విభాగాలన్నీ పార్టీకి వెన్నెముకలాగా ఉండాలి 4. ప్రజలకు మాట ఇచ్చి తప్పిన కూటమి ప్రభుత్వంపై ప్రజావ్యతిరేక పోరాటాలకు సంసిద్దంగా ఉండాలి 5. ప్రజలను విస్మరించి కూటమి ప్రభుత్వం చేసిన మోసాలను జనంలోకి తీసుకెళ్ళడంలో అనుబంధ విభాగాలు కీలకపాత్ర పోషించాలి 6. పార్టీ అనుబంధ విభాగాలకు కూడా అవసరమైన శిక్షణా తరగతుల నిర్వహణపై సమావేశంలో చర్చ, త్వరలో శిక్షణా తరగతులు నిర్వహించాలని నిర్ణయం ఈ సమావేశానికి వైయస్ఆర్సీపీఅనుబంధ విభాగాల అధ్యక్షులు హాజరై, పలు కీలక అంశాలపై చర్చించినట్లు పార్టీ నేతలు తెలిపారు.