న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి కొద్ది సేపటి క్రితమే ఢిల్లీ చేరుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరిన సీఎం సాయంత్రం దేశ రాజధానిలో అడుగుపెట్టారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో సీఎం వైయస్ జగన్ భేటీ కానున్నారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలపై ఆయన అమిత్ షాతో చర్చించనున్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, మిథున్రెడ్డి, వైయస్ అవినాష్రెడ్డి ఉన్నారు.