ప్రకాశం: వైయస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తల్లి యర్రం పిచ్చమ్మ(85) సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. తమ మాతృమూర్తి మృతి వార్త తెలియడంతో వైవీ సుబ్బారెడ్డి హుటాహుటిన ఢిల్లీ నుంచి ఒంగోలుకు ఢిల్లీ నుంచి వచ్చి తల్లి మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. కాగా, పిచ్చమ్మ మృతిపై వైయస్ఆర్సీపీ అధినేత వైయస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు. పిచ్చమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. రేపు వైయస్ జగన్ మేదరమెట్ల పర్యటన తాడేపల్లి: వైయస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి రేపు (18.03.2025) బాపట్ల జిల్లా మేదరమెట్లలో పర్యటించనున్నారు. మంగళవారం ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి బాపట్ల జిల్లా మేదరమెట్ల చేరుకుంటారు. అక్కడ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి నివాసానికి చేరుకుని, ఆయన మాతృమూర్తి యర్రం పిచ్చమ్మ (85) పార్దివ దేహానికి నివాళులర్పిస్తారు. వైవీ కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12 గంటలకు తాడేపల్లి చేరుకుంటారు. పార్టీ నేతల నివాళులు ఒంగోలులోనే వైవీ సుబ్బారెడ్డి మాతృమూర్తి పిచ్చమ్మ పార్థివదేహానికి వైయస్ఆర్సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి, మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్బాబు, తదితరులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ..వైవి సుబ్బారెడ్డి గారి తల్లి మరణం బాధాకరమన్నారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని దేవుణ్ణి ప్రార్ధిస్తున్నట్లు చెప్పారు. ఆమె ముగ్గురు కుమారులును ప్రయోజకులను చేయడంలో పిచ్చమ్మ గారి పాత్ర గొప్పదని కొనియాడారు. వైవి సుబ్బారెడ్డి వైయస్ఆర్సీపీ ఆవిర్భావం నుంచి పార్టీ అభివృద్ధి కి కృషిచేశారని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.