నెల్లూరు: అన్నదాతల్లో ఆత్మస్థైర్యాన్ని నింపడానికి రాష్ట్ర ప్రభుత్వం తరుపున ఏడాదికి రూ.13,500 ఆర్థిక సహాయం ఇచ్చే ‘వైయస్ఆర్ రైతు భరోసా – పీఎం కిసాన్’ పథాకాన్ని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ మేరకు రైతులకు వైయస్ఆర్ రైతు భరోసా చెక్కులను పంపిణీ చేశారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండలం కాకుటూరు గ్రామంలోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రైతు భరోసా పథకాన్ని సీఎం చేతుల మీదుగా ప్రారంభించారు. Read Also: దేశమంతా సీఎం వైయస్ జగన్ వైపు చూస్తోంది