పశ్చిమగోదావరి: రౌడీషీటర్ను ఆదర్శంగా తీసుకోవాలని చంద్రబాబు సూచించడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు మండిపడ్డారు. దళితులపై, ఎమ్మార్వో వనజాక్షిపై దాడి చేసిన చింతమనేని ప్రభాకర్ హింసను ప్రోత్సహించే చంద్రబాబు, ఆయన పార్టీ నాయకులకు మాత్రమే ఆదర్శప్రాయుడన్నారు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో ఎమ్మెల్యే బాలరాజు మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలను తప్పుదోవ పట్టించడానికే ప్రతిపక్ష నేత చంద్రబాబు జిల్లాలో పర్యటించారని దుయ్యబట్టారు. అధికారులు, దళితులు, గిరిజనులపై దాడులకు పాల్పడ్డ చింతమనేని ప్రభాకర్ను చంద్రబాబు వెనకేసుకురావడం సిగ్గుచేటు అని విమర్శించారు. పత్తి రైతులకు సీఎం వైయస్ జగన్ సర్కార్ అండగా ఉంటుందని, మార్కెట్ యార్డులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే బాలరాజు కోరారు. Read Also: బయో ఫెర్టిలైజర్స్ నియంత్రణకు కేంద్రం అనుసరించే విధానం ఏంటి?