పల్నాడులో వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్త దారుణ హత్య 

పల్నాడు : కూటమి పాలనలో టీడీపీ గుండాలు మరో దారుణానికి తెగబడ్డారు. కిడ్నాప్‌ చేసిన వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్త హరిచంద్రను దారుణంగా హతమార్చారు.  ఈ ఘటనతో జిల్లా వ్యాప్తంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.రెండు రోజుల కిందట నాగార్జునసాగర్ లోని హిల్ కాలనీలో  పింఛన్ తీసుకోవడానికి వెళ్లిన హరిచంద్ర తిరిగి రాలేదు. టీడీపీ నేతలు కొందరు ఆయన్ని కిడ్నాప్‌ చేసినట్లు  కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ క్రమంలో ఆయనను చంపేస్తారేమో అని ఆందోళన వ్యక్తం చేశారు కూడా. చివరకు.. టీడీపీ నేతలే చంపేసి ఆ మృతదేహాన్ని ఆయన పొలంలోనే పడేశారు

Back to Top